సకాలంలో ఈ-బస్సులు సరఫరా చేయాలి

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రి పొన్నం సమీక్ష

విద్యుత్‌ బస్సులపై సమీక్షిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌. చిత్రంలో నాగిరెడ్డి, వికాస్‌రాజ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు వచ్చే ఈ-బస్సులు సకాలంలో సరఫరా అయ్యేలా, సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. విద్యుత్‌ బస్సుల తయారీ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘పీఎం ఈ-డ్రైవ్‌’ కింద హైదరాబాద్‌ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను కేంద్రం కేటాయించిన నేపథ్యంలో వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు. కొత్త విద్యుత్‌ బస్సుల విషయంలో పూర్తి సహకారం అందిస్తామని, ఎంపిక చేసిన బస్‌ డిపోల్లో హై-టెన్షన్‌ విద్యుత్‌ కనెక్షన్లను సకాలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత అనుభవ సమస్యలను బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధుల దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు