ఎకరానికి రూ.50 వేల పరిహారమివ్వాలి: కవిత

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మక్తాపల్లిలో మహిళా రైతుతో మాట్లాడుతున్న కవిత  

ఈనాడు, కరీంనగర్‌: ఇటీవల వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించి రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారాన్ని అందించాలని.. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె కరీంనగర్‌ జిల్లాకు వచ్చారు. తిమ్మాపూర్‌ మండలంలోని మక్తాపల్లిలో తుపానుకు దెబ్బతిని నేలవాలిన వరి పంటలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. తరువాత శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్‌ను సందర్శించారు. రెండేళ్ల నుంచి ఇక్కడ ఎలాంటి మరమ్మతులు లేవని, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు  పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిలు రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచించాలన్నారు. ఇటీవల భీమదేవరపల్లి మండలం వంగర బీసీ గురుకులంలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందగా హుజూరాబాద్‌ మండలంలోని రాంపూర్‌లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. రామడుగులో శిల్పకళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు