ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తికి మరో రెండు నెలల గడువివ్వండి

Eenadu icon
By Telangana News Desk Updated : 01 Nov 2025 04:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సుప్రీంకోర్టును కోరిన అసెంబ్లీ కార్యదర్శి 

ఈనాడు, దిల్లీ: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తిచేయడానికి మరో రెండు నెలల గడువు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి దాఖలుచేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారించి నిర్ణయం వెలువరించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం జులై 31న తీర్పు వెలువరించింది. దాని ప్రకారం అక్టోబరు 31లోపు స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ విచారణ పూర్తిచేసి, తీర్పు రిజర్వు చేశారని అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకు విన్నవించారు.

సమయాభావం కారణంగా మిగిలిన పిటిషన్లపై విచారణ పూర్తిచేయలేక పోయినందున మరో 2 నెలలు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ వివిధ అంతర్జాతీయ సదస్సులకు హాజరు కావాల్సి రావడం, ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడం, అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులంతా ప్రత్యక్షంగా తమ వాదనలు వినాలని కోరడం వల్ల ఈ పిటిషన్లపై విచారణ పూర్తిచేయడంలో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గడువు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ వచ్చేవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది.

Tags :
Published : 01 Nov 2025 04:16 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు