రన్‌వేపైకి వెళ్లిన విమానంలో పొగలు

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పైలట్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

శంషాబాద్, న్యూస్‌టుడే: రన్‌వేపైకి వెళ్లిన ఇండిగో విమానంలో పొగలు వచ్చిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం 206 మంది ప్రయాణికులను ఎక్కించుకొని పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి టేకాఫ్‌ తీసుకోవడానికి రాత్రి 8.20 గంటలకు రన్‌వేపైకి వచ్చింది. గాలిలోకి ఎగరడానికి సిద్ధమవుతుండగా విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ నిపుణులు సాంకేతిక లోపాన్ని గంటన్నరపాటు శ్రమించి సరిచేశారు. దీంతో 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. 

జెడ్డా విమానానికి బాంబు బెదిరింపు

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం శనివారం 179 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు టేకాఫ్‌ తీసుకున్న తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్‌ సెంటర్‌ అధికారులు గగనతలంలో ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని దారి మళ్లించి ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో విమానం 8 గంటలు ఆలస్యంగా శంషాబాద్‌ చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు