వ్యవసాయ కార్పొరేషన్ల ఆర్థికస్థితిపై నివేదిక ఇవ్వాలి: మంత్రి తుమ్మల

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలోని కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, అప్పులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయా కార్పొరేషన్లు సమర్థంగా పనిచేసేలా, రైతులకు నాణ్యమైన సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవసాయ శాఖలో కార్పొరేషన్ల తీరు అధ్వానంగా మారింది. అవి ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. ఎన్నోఏళ్లపాటు రైతులకు సేవలందించిన ఆగ్రోస్‌ నిరర్థకంగా మారింది. వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తాం. త్వరలో ఆగ్రోస్‌ను పునరుద్ధరిస్తాం. మొంథా తుపాన్‌తో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం. ఎకరానికి రూ.పది వేల పరిహారం ఇస్తామంటూ సీఎం ప్రకటించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. పత్తి రైతులు తేమ శాతం విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు