10% పెరిగిన జీఎస్టీ ఆదాయం

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, దిల్లీ: జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ తర్వాత తెలంగాణ ఆదాయం 10% పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం 9% తగ్గింది. దేశవ్యాప్తంగా సగటున 4.6% వృద్ధి నమోదైంది. కేంద్ర ఆర్థికశాఖ శనివారం విడుదల చేసిన అక్టోబరు గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సెప్టెంబరు 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్టోబరులో తెలంగాణ ఖజానాకు రూ.5,726 కోట్లు జమ అయ్యింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన రూ.5,211 కోట్ల కంటే ఇది 10% ఎక్కువ. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,490 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఇది 9% తక్కువ. ఎస్‌జీఎస్టీ సెటిల్‌మెంట్‌ తర్వాత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెలంగాణకు రూ.26,334 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు