కాలుతున్న శవాలపైనా బంగారం వేట

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 03:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బంగారం ధర తారస్థాయికి చేరుతున్న కొద్దీ.. కొందరిలో మానవత్వం అధఃపాతాళానికి దిగజారుతోంది.  మెదక్‌ జిల్లా చేగుంటలో ఇద్దరు వృద్ధులు చనిపోయాక శ్మశానంలో వారి చితాభస్మాన్ని ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానిక ఎస్సై చైతన్యరెడ్డి తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన వృద్ధురాళ్లు మురాడి నర్సమ్మ గత నెల 30న, నాగమణి 31న మృతి చెందారు. ఇద్దరి అంత్యక్రియలు స్థానిక వైకుంఠధామంలో నిర్వహించారు. శనివారం నాగమణి కుటుంబసభ్యులు వైకుంఠధామానికి వెళ్లగా.. చితిపై నీళ్లు పోసి సగం కాలిన మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. పక్కనే నర్సమ్మ చితి వద్దకు వెళ్లి చూడగా.. తల భాగంలోని చితాభస్మం మొత్తం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అంత్యక్రియల సమయంలో చితిపై ఉన్న మృతదేహం నోట్లో కొద్దిగా బంగారం పెడుతుంటారు. వృద్ధుల చెవి పోగులను అలాగే వదిలేస్తుంటారు. దొంగలు వీటి కోసమే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

న్యూస్‌టుడే, చేగుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు