సీఎంతో కెనడా హైకమిషనర్, ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 04:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కెనడా హైకమిషనర్‌ క్రిస్టోఫర్‌ కూటర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కెనడా హైకమిషనర్‌ క్రిస్టోఫర్‌ కూటర్, ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లామీ శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు, పెట్టుబడులకు అవకాశాలపై వారు చర్చించారు. కెనడా భాగస్వామ్యంతో చేపట్టే ఐటీ, ఫార్మా,   ఏరోస్పేస్, పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఆ దేశ హైకమిషనర్‌తో సీఎం చర్చించారు. రాష్ట్రంలో అంకుర సంస్థలు, విద్యారంగం, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని కోరారు. ఫ్రాన్స్‌ సహకారంతో హైదరాబాద్‌లో చేపట్టిన ప్రాజెక్టుల గురించి మార్క్‌ లామీతో సీఎం చర్చించారు. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. 

సీఎంతో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లామీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని