జాతీయ వైద్యవిద్య పరీక్షల బోర్డు సభ్యుడిగా డాక్టర్‌ రాకేష్‌ ఎన్నిక

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 04:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిధిలోని స్పెషలిస్ట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ సభ్యుడిగా ప్రముఖ వైద్యుడు రాకేష్‌ కలపాల ఎన్నికయ్యారని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం డాక్టర్‌ రాకేష్‌ ఏఐజీ సెంటర్‌ ఫర్‌ ఏఐ, ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలో అధునాతన ఏఐ, ఎంఎల్‌ స్పెషాలిటీల కోసం పాఠ్యాంశాలు, పరీక్షలు, అక్రిడిటేషన్‌ ప్రమాణాలు రూపొందించడం, వైద్యవిద్య, రోగి సంరక్షణకు పెద్దపీట వేసేలా ప్రణాళిక సిద్ధం చేయడంలో డాక్టర్‌ రాకేష్‌ కీలక భూమిక పోషించనున్నట్లు ఏఐజీ పేర్కొంది. ఈ సందర్భంగా ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఇతర వైద్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు