కుభీరులో టోకెన్ల పంపిణీలో తోపులాట

Eenadu icon
By Telangana News Desk Published : 02 Nov 2025 05:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇద్దరు మహిళా రైతులకు గాయాలు

టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతులు

కుభీరు, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా కుభీరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం సోయా కొనుగోళ్ల కోసం చేపట్టిన టోకెన్ల పంపిణీలో తోపులాట జరిగింది. ఇందులో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. టోకెన్ల కోసం రైతులు వేకువజామున సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. వరుసలో చెప్పులు, రాళ్లు పెట్టారు. కార్యాలయం తెరవగానే పెద్దసంఖ్యలో బారులు తీరారు. అధికారులు టోకెన్లకు అవసరమైన పత్రాలు తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో గచ్చుపై నుంచి కిందపడటంతో కుభీరుకు చెందిన బత్తిని చంద్రబాయి, పార్డి(కె) గ్రామానికి చెందిన శానే లక్ష్మీబాయిలు గాయపడ్డారు. పలువురు రైతులు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్సై కృష్ణారెడ్డి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పీఏసీఎస్‌ సీఈఓ క్రాంతికుమార్, సిబ్బంది రైతులకు టోకెన్లు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు