రహదారి మధ్యలో బిందు సేద్యం

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 563లో విభాగిని (డివైడర్‌) మధ్యలో నాటిన మొక్కలకు బిందు సేద్యం ద్వారా నిత్యం నీరందించేందుకు ప్రతి కిలో మీటరుకు 5 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు ప్లాస్టిక్‌ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి శివారులో ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులివి. జాతీయ రహదారుల నిర్మాణంలో వస్తున్న మార్పులకు ఇవి అద్దం పడుతున్నాయి. 

న్యూస్‌టుడే, మానకొండూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు