ఆయిల్‌పాం దిగుమతి శాతంలో తెలంగాణ హవా!

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దేశంలోనే అత్యధిక ఓఈఆర్‌ 20.01% నమోదు 

అత్యధిక ఓఈఆర్‌ సాధించిన అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమ

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: ఈ ఏడాది భారీ వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నా ఆయిల్‌పాం మాత్రం బలంగా నిలిచింది. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఓఈఆర్‌ (నూనె దిగుమతి శాతం) నమోదుతో తెలంగాణ రికార్డు సృష్టిస్తోంది. తొలిసారిగా మలేసియా ఓఈఆర్‌కు సమానంగా అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమ 20.01% సాధించిందని పరిశ్రమ మేనేజర్‌ కల్యాణ్‌ తెలిపారు. ఓఈఆర్‌ పెరిగితే గెలల ధర కూడా భారీగా పెరుగుతుందన్నారు. 2024 నవంబరు 1 నుంచి 2025 అక్టోబరు 31తో ఆయిల్‌ సంవత్సరం ముగుస్తుంది. ఈ ఏడాది కాలంలో అశ్వారావుపేట పరిశ్రమలో 1,02,343 టన్నులు, అప్పారావుపేటలో 2,26,609 టన్నులు, ఇటీవలే ట్రయల్‌రన్‌ చేసిన సిద్దిపేట జిల్లా నర్మెట్ట పరిశ్రమలో 2,500 టన్నుల గెలలు గానుగ ఆడారు. దీంతో ఈ ఏడాది నిర్దేశించిన 3 లక్షల టన్నుల లక్ష్యాన్ని మించి 3,31,452 టన్నులు గానుగ ఆడారు. ఈ క్రమంలోనే అప్పారావుపేట పరిశ్రమ సగటు ఓఈఆర్‌ 20.01% రాగా అశ్వారావుపేటలో 19.47% వచ్చింది. ఆయిల్‌పాం రైతులకు ఈ ఏడాది సగటు ధర టన్నుకు రూ.19,700 దక్కింది. 2023-24 ఏడాదితో పోల్చితే రూ.4,690 ఎక్కువ వచ్చింది. 2025 అక్టోబరులో టన్ను గెల ధర రూ.19,681గా ఖరారైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు