అడవిలో 8 కి.మీ. నడిచొచ్చి ఓటేసి..

Eenadu icon
By Telangana News Desk Updated : 15 Dec 2025 07:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఓటు వేసేందుకు అడవిలో వాగు దాటి వెళ్తున్న రేగళ్లగుంపు గొత్తికోయలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రేగళ్లగుంపునకు చెందిన గొత్తికోయలు కారడవిలో రాళ్లూరప్పల మార్గంలో వాగులూ వంకలూ దాటి 8 కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఓటు వేశారు. 20 ఏళ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన 45 గొత్తికోయ కుటుంబాలు బచ్చువారిగూడెం పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం 200 మందికి పైగా జనాభా ఉన్న ఇక్కడ 97 మందికి ఓటుహక్కు ఉంది. ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రేగళ్లగుంపునకు చెందిన గొత్తికోయలంతా కాలినడకన బచ్చువారిగూడెం పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. చంటి బిడ్డలున్న తల్లులు సైతం వారిని ఎత్తుకుని ఎనిమిది కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి మరీ ఓటు వేయడం విశేషం.    -న్యూస్‌టుడే, అశ్వారావుపేట గ్రామీణం

Tags :
Published : 15 Dec 2025 07:28 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని