Telangana News: ప్రతిష్ఠాత్మక పథకాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్‌

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 03:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పలువురు ఐఏఎస్‌ల బదిలీలు 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు (ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ ఫ్లాగ్‌షిప్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్స్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్‌ను నియమించింది. ప్రస్తుతం పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను బదిలీ చేసింది. అయితే సంక్షేమ శాఖలో మాత్రం ఆయన్ని పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. మరికొందరు ఐఏఎస్‌ అధికారులను కూడా బదిలీలు చేస్తూ, పోస్టింగ్‌లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

  • మహిళా- శిశు అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి శాఖల కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా, అదే శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  • మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ కార్యదర్శి ఇలంబర్తిని రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఈయనకు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  • మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దే ఉంచుకున్నారు. 
  • బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌కు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌(జీఏడీ) కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  • హార్టికల్చర్‌ అండ్‌ సెరికల్చర్‌ డైరెక్టర్‌ ఎస్‌కే యాస్మిన్‌కు టీజీ ఆయిల్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు. 
  • ఆదిలాబాద్‌ జడ్పీ సీఈఓ జి.జితేందర్‌రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి... ఎస్సీ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌గా నియమించారు. ఈయనకు టీజీ ఎస్సీ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. 
  • మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులుకు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు