Jubilee hills bypoll: అభివృద్ధికి అవకాశమివ్వండి
భారత రాష్ట్ర సమితికి మూడుసార్లు పట్టం కట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించండి
జూబ్లీహిల్స్లో సమస్యలకు కేసీఆర్, కేటీఆర్లదే బాధ్యత
పోలింగ్లోగా కిషన్రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెస్తారో చూద్దాం
బోరబండ, ఎర్రగడ్డ ప్రచార సభల్లో సీఎం రేవంత్రెడ్డి 

బోరబండ ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో అనిల్కుమార్ యాదవ్, 
బాబా ఫసియుద్దీన్, అజారుద్దీన్, అభ్యర్థి నవీన్కుమార్ యాదవ్, మహేశ్కుమార్ గౌడ్
ఈనాడు,హైదరాబాద్, బోరబండ, అమీర్పేట, న్యూస్టుడే: ‘‘జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఓటర్లుగా మూడుసార్లు భారత రాష్ట్ర సమితికి అవకాశమిచ్చి మాగంటి గోపీనాథ్ను గెలిపించారు. పేదప్రజలకు ఆయన ఎలాంటి సేవలు అందించలేదు. నాకు మంచి స్నేహితుడైనప్పటికీ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలో అడగలేదు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలంటూ ఎప్పుడూ లేఖ కూడా ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరు నవీన్ యాదవ్కు 30 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయాన్ని అందించండి. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఆయన ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రూ.వందల కోట్ల నిధులు తీసుకొస్తాం. అభివృద్ధి పనులన్నింటినీ నేను దగ్గరుండి చేయిస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఆయన బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నిర్వహించిన కూడలి సమావేశాల్లో ప్రసంగించారు. ‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంగా మాగంటి సునీతను గెలిపించాలని భారత రాష్ట్ర సమితి నాయకులు సానుభూతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సొంత ఆడబిడ్డను కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెలివేసిన కేటీఆర్, హరీశ్రావు మాయమాటలు చెబుతున్నారు. వారి కల్లబొల్లి మాటలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి.
ఇక్కడి సమస్యలు.. వారి పాపమే
గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి కారును షెడ్డుకు పంపారు. దీంతో సహనం కోల్పోయిన బిల్లా..రంగాలు బెంజ్ కార్లు వదిలేసి జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఆటోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇవి కొత్తగా రాలేదు. భారత రాష్ట్ర సమితి నాయకులు అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేశారు. ప్రతి డివిజన్లోనూ సమస్యలు పేరుకుపోయాయంటే తండ్రీకుమారులదే బాధ్యత. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్కార్డులిచ్చాం. ఓఆర్ఆర్ , శంషాబాద్ విమానాశ్రయం, మెట్రోరైల్ మేమే తెచ్చాం. ఇక హైదరాబాద్లో గరీబోళ్ల గుండె చప్పుడు పి.జనార్దన్రెడ్డి మరణిస్తే ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని నిలబెట్టింది. అప్పుడు సానుభూతి గుర్తుకు రాలేదా? పీజేఆర్ చేసిన సేవలకు గుర్తుగా బోరబండ కూడలిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. పీజేఆర్లా పేద ప్రజలకు సేవ చేయాలంటే నవీన్ యాదవ్ను గెలిపించాలి.

బోరబండ కాంగ్రెస్ ప్రచార సభలో పాల్గొన్న జనం
జూబ్లీహిల్స్కు ఎన్ని నిధులిచ్చారో కిషన్రెడ్డి చెప్పాలి
కేంద్రమంత్రిగా రెండోసారి పనిచేస్తున్న కిషన్రెడ్డి.. ఆయన నియోజకవర్గ పరిధిలోని జూబ్లీహిల్స్కు ఎన్ని నిధులిచ్చారో లెక్కచెప్పాలి. పోలింగ్లోగా నియోజకవర్గానికి ఎన్ని పైసలు తెస్తారో చూద్దాం. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే మీకెందుకు ఇబ్బంది? మైనార్టీల ఓట్లు మీకు రావు. భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయించేందుకే ఇదంతా చేస్తున్నారు. ఉప ఎన్నికలో భాజపా డిపాజిట్ కోల్పోవడం ఖాయం. అంతేకాదు.. 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ చెప్పిన ఆ పార్టీకి ఓట్లు వేయకండి. ఈ ఎన్నికల్లో ఒకవైపు మోదీ, కేసీఆర్.. మరోవైపు రాహుల్, రేవంత్రెడ్డి ఉన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అంటూ ఓటర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మంత్రి అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎంపీ అనిల్కుమార్యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 


