Jubilee Hills bypoll: కాంగ్రెస్ గెలిస్తే అరాచకాలకు ఊతం
ప్రజలకు అండగా నిలిచేది భాజపానే
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

షేక్పేటలో భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
అమీర్పేట, షేక్పేట, న్యూస్టుడే: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మజ్లిస్ బహిరంగంగా మద్దతిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ఐటీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి సాధించిన కొత్త నగరం కూడా పాతబస్తీలా మారిపోతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో మజ్లిస్ అరాచకాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి నవీన్యాదవ్ గెలుపొందినా వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇవ్వబోరని, మజ్లిస్ గూటికి చేరి పోటీ చేస్తారని అన్నారు. షేక్పేట, ఎర్రగడ్డ డివిజన్లలో నిర్వహించిన భాజపా సమన్వయకర్తలు, ఇన్ఛార్జులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు అండగా నిలిచి, సంక్షేమానికి పాటుపడేది భాజపా మాత్రమేనని చెప్పారు. ఎన్నికకు మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉందని.. రాముడికి ఆంజనేయుడిలా పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయాలని కిషన్రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధిస్తే కార్పొరేటర్ స్థానం కూడా ఇక్కడి నుంచి గెలవవచ్చన్నారు. మన ప్రాంతం అభివృద్ధి కావాలి.. ప్రజలకు రక్షణగా నిలవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ను గత భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.
జూబ్లీహిల్స్లో గెలిచి చూపాలి: సునీల్ బన్సల్
తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచి చూపించాలని భాజపా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. ఉప ఎన్నికను సవాల్గా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్లోని సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ భయపడకుండా, ఎక్కడా తగ్గకుండా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, ఎంపీ రఘునందన్రావు, భాజపా జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్రెడ్డి, గౌతమ్రావు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సునీల్ బన్సల్, చిత్రంలో రఘునందన్రావు, ఎన్.రామచందర్రావు, కిషన్రెడ్డి, దీపక్రెడ్డి, గౌతమ్రావు తదితరులు
ట్రాఫిక్లో చిక్కుకున్న కిషన్రెడ్డి కాన్వాయ్
అమీర్పేట, న్యూస్టుడే: ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని మోతీనగర్లోని ఓ ఫంక్షన్హాల్కు వస్తున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుకుంది. కేంద్రమంత్రి వస్తున్నా.. పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల జాడ లేకపోవడంతో కిషన్రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షం వస్తున్నా.. ఆయన స్థానిక చౌరస్తా నుంచి ఫంక్షన్హాల్కు నడుచుకుంటూ వెళ్లారు. ఇదే సమావేశానికి సునీల్బన్సల్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, ఎంపీ రఘునందన్రావు తదితరులు హాజరయ్యారు. ముఖ్యనేతలు వస్తున్నా ప్రొటోకాల్ పాటించకపోవడమేమిటని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకే: డీకే అరుణ
ఈనాడు, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకే రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్ను తీసుకోవాలని చూస్తున్నారని భాజపా ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.హైదరాబాద్లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 


