Kishan Reddy: ధైర్యముంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయండి
సీఎం రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి సవాల్
ముఖ్యమంత్రి హద్దులు దాటి మాట్లాడుతున్నారని ధ్వజం

షేక్పేట నాలా అంబేడ్కర్నగర్లో ప్రచారంలో భాగంగా ఓ యువకుడికి కరపత్రం అందజేస్తున్న కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్- అమీర్పేట, న్యూస్టుడే: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి హద్దులు దాటి మాట్లాడుతున్నారని... కాంగ్రెస్కు ఓటేయకపోతే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకమని... ధైర్యముంటే రద్దు చేసి చూపాలని సవాల్ విసిరారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి దీపక్రెడ్డితో కలిసి యూసుఫ్గూడ సమీపంలోని కృష్ణకాంత్ పార్కులో పర్యటించి... యోగా సాధకులు, కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. షేక్పేట డివిజన్ పరిధిలోని నాలా అంబేడ్కర్నగర్, బీజేఆర్నగర్, ఎంజీనగర్లలో సాయంత్రం ఇంటింటి ప్రచారం చేశారు. ఆయా సందర్భాల్లో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్లో మజ్లిస్ అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా.. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చినా.. గెలుస్తామో లేదోనన్న అనుమానంతో, భయంతో.. కాంగ్రెస్కు ఓటేయకపోతే సన్న బియ్యం పంపిణీ మానేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బెదిరించడం సరికాదు.
దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రతి కిలోకు రూ.42 చొప్పున ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.15 మాత్రమే భరిస్తోంది. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. భాజపాపై అబద్ధాల ప్రచారంతో ఓ వర్గం ఓట్లు రాబట్టుకోవాలని కుట్ర పన్నుతోంది. దేశ సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిలకు అలవాటే. సైనికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే. జూబ్లీహిల్స్లో వీధి దీపాలు ఏర్పాటు చేసి, రోడ్లు వేసిన తర్వాతే సీఎం ఓట్లు అడగాలి. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిల మధ్య దిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరింది. అందుకే ఏ రోజూ భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడటం లేదు. ఒక్క కేసులోనూ భారత రాష్ట్ర సమితిపై చర్యలు లేవు. మెట్రో రైలును అడ్డుకుంటున్నారంటూ నాపై రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మెట్రో నడపలేమని ఎల్ అండ్ టీ చెబుతోంది. ఆ సంస్థ ఎండీతో మీరే ఫొటోలు దిగారు. మెట్రోను టేకోవర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా నన్ను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కన్నా కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎంలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. మూడు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో వారు విసుగు చెందారు. సమస్యల పరిష్కారం భాజపాతోనే సాధ్యం’’ అని కిషన్రెడ్డి అన్నారు.
కళాశాలల ధర్నాకు భాజపా మద్దతు: అంజిరెడ్డి
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. కళాశాల యాజమాన్యాలు సోమవారం నుంచి చేపట్టనున్న ధర్నాకు భాజపా మద్దతు ఇస్తోందన్నారు. సర్కారు స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

యువతిపై గ్యాంగ్ రేప్: ఎయిర్ పోర్ట్ వద్ద నిందితులపై ఎన్కౌంటర్
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్రాజ్
 


