KTR: ఇది కారు, బుల్డోజర్‌ మధ్య జరిగే ఎన్నిక: కేటీఆర్‌

Eenadu icon
By Telangana News Team Published : 31 Oct 2025 14:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ భవన్‌లో పలువురు ఎంఐఎం నేతలు కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్‌ను అడగాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో గెలిచేది మాగంటి సునీతనే అని తెలిపారు. ఇది కారు, బుల్డోజర్‌ మధ్య జరిగే ఎన్నిక అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు. ఈ సర్కారు ఎవరినీ వ్యాపారాలు చేసుకోనివ్వడం లేదని దుయ్యబట్టారు. (Telangana News)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు