Ponnam: టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో రావడంతోనే ప్రమాదం..! : మంత్రి పొన్నం

Eenadu icon
By Telangana News Team Updated : 03 Nov 2025 10:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చేవెళ్ల గ్రామీణం: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీకోట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారని తెలిపారు.

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దానికింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయడ్డారు. (Road Accidents)

Tags :
Published : 03 Nov 2025 10:04 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు