Sudarshan Reddy: ప్రభుత్వ సలహాదారుగా పి.సుదర్శన్రెడ్డి
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్గా ప్రేమ్సాగర్రావు
క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి పదవులు ఆశిస్తున్న ఇద్దరు నాయకులకు ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ స్థాయి హోదాలిస్తూ పదవులు కట్టబెట్టింది. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డిని సలహాదారుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించింది. ఇద్దరినీ క్యాబినెట్ హోదాలో నియమించగా, సుదర్శన్రెడ్డి మాత్రం అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని పేర్కొంది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నాయకులిద్దరికీ మొదటి నుంచీ మంత్రివర్గంలో స్థానం ఇస్తారన్న అంచనాలుండేవి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి.. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఈ ఇద్దరికీ క్యాబినెట్ హోదా కల్పిస్తూ పదవులు ఇవ్వడం, వారిలో ఒకరికి మంత్రులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకొంది. రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించడానికి వీలుండగా, అజారుద్దీన్కు మాత్రమే ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
ఆది నుంచీ రేసులో వారిద్దరు...
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు కూడా. కానీ అధిష్ఠానం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యంగా అమలు చేసే అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారునిగా సుదర్శన్రెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమాల అమలుపై జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులతో ఆయన సమీక్షించవచ్చు.
సుదర్శన్రెడ్డికి మంత్రులతోపాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని, సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్స్ దగ్గరే ఆయన ఛాంబర్ కూడా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని తెలిపింది. ప్రభుత్వం ప్రాధాన్యంగా అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల యూనిట్కు... ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి స్థాయి అధికారి అధిపతిగా ఉంటూ.. సలహాదారుకు సహకరిస్తారని, ఆయా పథకాల అమలు తీరుపై ఈ యూనిట్ ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి నివేదిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మొదటి నుంచీ మంత్రివర్గంలో స్థానం కోసం పట్టుపడుతున్నారు. తాజాగా ఆయనకు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే ఆయన దీంతో సంతృప్తి చెందుతారో లేదో చూడాల్సి ఉంది.
ఇక విస్తరణ ఉండదా?
ఇప్పటికే ప్రత్యేక సలహాదారుగా ఉన్న కె.కేశవరావుకు క్యాబినెట్ హోదా ఉంది. సీఏం ముఖ్య సలహాదారు సహా మిగిలిన సలహాదారులకు ఆ హోదా లేదు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షునిగా ఉన్న చిన్నారెడ్డి మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానితులుగా ఉండగా, ఇప్పుడు సుదర్శన్రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ప్రస్తుత నియామకాలతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇంకా మరికొందరు మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉందా లేక ఆహ్వానితులుగా ఉన్న వారితో కలిసి గరిష్ఠ సంఖ్యకు చేరినందున కొత్తగా ఎవరికీ అవకాశం ఉండదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 


