Kavitha: ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదు?: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana News Team Published : 11 Aug 2025 21:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ బీసీలను వంచించాలని చూస్తోందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జాగృతి, యూపీఎఫ్‌, బీసీ నేతలతో సోమవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. కలిసి వచ్చే అన్ని వర్గాలతో ముందుకెళ్తానని తెలిపారు.

‘‘రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు. ఇదే విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? బీసీల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత వారినే మోసం చేస్తున్నారు. పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనేది కంటితుడుపు చర్యే. ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదు?’’అని కవిత ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని