Komatireddy: మొంథా ఎఫెక్ట్‌.. తెలంగాణలో 230 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు

Eenadu icon
By Telangana News Team Published : 30 Oct 2025 15:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ‘మొంథా’ తుపాను కారణంగా తెలంగాణలో 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాలశాఖ పూర్తి అప్రమత్తతతో ఉందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కాజ్‌వేల పునరుద్ధరణకు రూ.7 కోట్లు ఖర్చవుతుందని, దెబ్బతిన్న రోడ్ల శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్లు అవసరమని చెప్పారు.

తుపాను వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందన్న ఆయన.. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. ‘‘ఐకేపీ సెంటర్లలో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. పత్తి తేమ శాతం గురించి ఇప్పటికే సీసీఐ ఛైర్మన్‌ను కలిశాను. నిబంధన సడలించాలని రైతుల పక్షాన ముంబయికి వెళ్లి విజ్ఞప్తి చేశాను’’ అని మంత్రి కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు