Chiranjeevi: చిరంజీవి డీప్‌ఫేక్‌ వీడియోలు తొలగింపు

Eenadu icon
By Telangana News Team Published : 31 Oct 2025 00:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: చిరంజీవి (Chirajeevi) డీప్‌ఫేక్‌ వీడియోల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆయా వీడియోలను సోషల్‌ మీడియా నుంచి పోలీసులు తొలగించారు. సైబర్‌ నేరగాళ్లు చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, అశ్లీల వీడియోలు సృష్టించగా.. ఐపీ అడ్రస్‌ ద్వారా ఎక్కడ నుంచి పోస్టు చేశారనే దానిపై విచారణ చేపట్టారు. విదేశాల నుంచి వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ‘ఎక్స్‌’లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్‌ చేయించారు. ఫేక్‌ వీడియోలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నగర సీపీ వీసీ సజ్జనార్‌కు చిరంజీవి ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని