Telangana News: విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే ఫీజులు..!
ప్రతిపాదనలు పరిశీలిస్తున్న సంక్షేమశాఖలు
ఎస్సీ విద్యార్థుల తరహాలో అమలుకు కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఏళ్లుగా బోధన రుసుములు సకాలంలో చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయిలు.. వాటి మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని కొన్ని కళాశాలలు అవకాశంగా తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మేరకు సమాలోచనలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్కరణ మేరకు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా బోధన ఫీజులు, ఉపకారవేతనాలు జమ చేస్తోంది. ఇదే విధానాన్ని మిగతా సంక్షేమ విభాగాల్లోనూ అమలుకు సాధ్యాసాధ్యాలను ఆయా సంక్షేమశాఖలు పరిశీలిస్తున్నాయి.
ఏటా రూ.2,400 కోట్లకు పైగా..
కోర్సు ముగియగానే ధ్రువపత్రాలను ఇవ్వడానికి విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు.. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక వాటిని తిరిగి విద్యార్థులకు చెల్లించడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు మంజూరు కాలేదని, వాటిని చెల్లించేవరకు ధ్రువపత్రాలు ఇవ్వబోమని చెబుతున్నాయి. ఫిర్యాదులపై పరిశీలించిన సంక్షేమశాఖలు.. విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా జమచేసే ప్రతిపాదనను ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి. రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం ఏటా 12.5 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారని, ఏటా డిమాండ్ రూ.2,400-2,600 కోట్ల వరకు ఉంటోందని తెలిపారు.
ఒకే విధానంలో..
ఎస్సీ విద్యార్థులకు ఏటా బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. వెంటనే కేంద్రం 60% నిధులు చెల్లిస్తుంది. ఈ మొత్తం నుంచి విద్యార్థులకు ఫీజులు మంజూరవుతాయి. ఎస్టీ విద్యార్థులకు కేంద్రం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తోంది. వీరికి విద్యార్థుల ఖాతాల్లో నేరుగా చెల్లించే విధానం అమలుచేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే బోధన ఫీజులు, ఉపకారవేతనాలు భరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా చెల్లింపులు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బోధన ఫీజులకు ఒకే విధానం అమలవుతుందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 


