Ghost Jobs: వారికదో తుత్తి.. ఉత్తుత్తి ఖాళీలతో ఉద్యోగ ప్రకటనలు

రాము ఒక వెబ్సైట్లో కనిపించిన ఉద్యోగ ప్రకటన నచ్చి దానికి ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుకున్నాడు. రోజులు, వారాలు గడిచిపోయాయి కానీ ఆ కంపెనీ నుంచి అతనికి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత రెండు నెలలకు ఆ కంపెనీ నుంచే అదే అర్హతలను అడుగుతూ మరో ప్రకటన వచ్చింది. ఈ సారైనా ఉద్యోగం వస్తుందేమోననుకొని దరఖాస్తు చేసుకుంటే... ఈసారీ అవే ఎదురుచూపులు..
రామునే కాదు ఈ మధ్య కాలంలో ఇలాంటి అనుభవాన్ని చాలామంది యువత ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇవి ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఇస్తున్న సిసలైన ప్రకటనలు కావు. అంటే ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీలకు ప్రకటనలన్నమాట. జాబ్మార్కెట్లో వీటిని ‘ఘోస్ట్ జాబ్స్’గా వ్యవహరిస్తుంటారు.
ఎందుకిలా చేస్తాయి...
కంపెనీలు ఈ తరహా ‘ఘోస్ట్ జాబ్స్’ ప్రకటనలు ఇస్తుండటం వెనక పలు కారణాలు, వ్యూహాలు దాగి ఉంటాయి..
- రెజ్యూమేలోని ఉద్యోగ అభ్యర్థుల వివరాలను సేకరించి కంపెనీలు భద్రపర్చుకుంటాయి. తద్వారా భవిష్యత్తులో చేపట్టే నియామకాల సమయంలో ఆ వివరాల ఆధారంగా తగిన అర్హతలున్న అభ్యర్థులను పిలుస్తాయి. నియామకాల ప్రక్రియ సమయాన్ని తగ్గించుకోవచ్చన్నది ఆ కంపెనీల ఉద్దేశం.
- ఉద్యోగ విపణిలోని పరిస్థితుల అధ్యయనానికి, నిపుణుల లభ్యతపై అంచనాకు వచ్చేందుకు, భవిష్యత్తులో నియామక వ్యూహాల మార్గనిర్దేశం కోసం ఈ మార్గాన్ని కంపెనీలు వాడుకుంటున్నాయి.
- ఉద్యోగ ప్రకటనలను తరచూ ఇస్తుండడం ద్వారా కంపెనీ పనితీరు బాగుందనే అభిప్రాయాన్ని, ప్రస్తుత ఉద్యోగుల్లో కలగజేయొచ్చని కూడా ఇలా చేస్తుంటాయి. తద్వారా ఉద్యోగుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు, వేరే కంపెనీలకు వలసపోకుండా నియంత్రించేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందన్నది వాటి భావన.
- ఉద్యోగ ప్రకటనలతో సంస్థ పనితీరు బాగుందనే సంకేతం ఇవ్వడం ద్వారా వాటాదార్లు, వినియోగదార్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవచ్చన్నది దీని వెనక మరో ఉద్దేశం.
మోసం కాదా?
- లేని ఉద్యోగ ఖాళీలకు ప్రకటనలు ఇవ్వడం ద్వారా కంపెనీలకు కొన్ని విధాలా ప్రయోజనం ఉండొచ్చేమో కానీ ఉద్యోగార్థులను మాత్రం ఇది తప్పుదోవ పట్టించడమే.
- అయితే డబ్బులు వసూలు చేయడం లాంటివి లేనందున.. ఇలాంటి ప్రకటనలను మోసం కిందకు చూడరాదనే వాదనను కొన్ని కంపెనీలు వినిపిస్తున్నాయి.
దుష్ఫలితాలున్నాయ్...
- ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీల ప్రకటనలకు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఉద్యోగార్థుల శ్రమ వ్యర్థం అవుతోంది. వాళ్లలో నిరాశ నిస్పృహను పెంచుతోంది.
- ఉద్యోగార్థులు ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియక అసలైన వాటికి కూడా దరఖాస్తు చేసుకోలేరు. అలా మంచి ఉద్యోగాలను కూడా వాళ్లు కోల్పోవచ్చు.
- తరచూ ఉత్తుత్తి ఉద్యోగ ఖాళీల ప్రకటనలు ఇస్తే.. కంపెనీల బ్రాండ్పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరమైన సమయంలో సరైన నిపుణులు దొరకకపోతే కంపెనీ పనితీరు దెబ్బతింటుంది.
మరేం చేయాలి?
- ఉత్తుత్తి ఉద్యోగ ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ పోర్టల్లో వారాలకు వారాలు లేదా నెలల పాటు ఒక ఉద్యోగ ప్రకటన కొనసాగినా లేదా పునరావృతమైనా దానిని విస్మరించాలి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు, సంప్రదించేందుకు చిరునామా లేదా ఫోన్ నెంబర్లు ఇవ్వకున్నా వాటిని పట్టించుకోవద్దు.
- ఏదైనా కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే.. ముందుగా ఆ కంపెనీ అధికారిక వెబ్సైట్లో నియామకాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా? లేదా? పరిశీలించుకోవాలి. అవసరమైతే స్థానిక కార్యాలయానికి వెళ్లి కనుక్కోవాలి.
- ఘోస్ట్ జాబ్స్ ప్రకటనల మార్గాన్ని కొందరు మోసం చేసేందుకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు కృత్రిమ మేధను, సామాజిక మాధ్యమాలను వాళ్లు విరివిగా వాడుకోవచ్చు. అందువల్ల ఎవరైనా ఉద్యోగం ఉందని ఆశజూపి ముందుగా డబ్బులు పంపించాలని అడిగినా, బ్యాంకు, ఆధార్ లాంటి వ్యక్తిగత వివరాలు అడిగినా స్పందించకూడదు.
ఈ రంగాల్లో ఎక్కువ..
నిర్మాణం, సాంకేతికత, న్యాయసేవలు, ఆహార, ఆతిథ్యం, తయారీ, ఆరోగ్య సంరక్షణ, రిటైల్. చిన్న, మధ్య తరహా కంపెనీల నుంచే ఇలాంటి ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయి.
ఈనాడు, బిజినెస్ డెస్కు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

రహస్య స్నేహితుడు... అంత హితుడేం కాదు!
అమెరికాలో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్(56) అనే వ్యక్తి చాట్జీపీటీని విశ్వసించి, అదే వాస్తవమనే స్థితికి చేరారు. అది చెప్పిందని కన్నతల్లినే మట్టుబెట్టాడు. -

సచిన్కు ఎదురైన యువరాజ్
మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 2 రోజుల తాడోబా పర్యటన సోమవారంతో ముగిసింది. మిత్రులతో కలిసి సచిన్ దంపతులు తాడోబా కోర్జోన్లో పర్యటించారు. -

హాయ్ జియా... నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా?
‘‘హాయ్ జియా... ఎయిర్పోర్టుకు దగ్గర్లో ఉన్నా.. ముంబయికి వెళ్తున్నా.. నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా... చెకిన్లో మార్పులున్నాయా..?’’ -

తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వండి: పొన్నం
గౌరవెల్లి సహా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్కుమార్ను కోరారు. -

హిల్ట్ పాలసీ పెద్ద కుంభకోణం
ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) పాలసీ పెద్ద కుంభకోణమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. -

ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోకుంటే రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షలు: ఆర్.కృష్ణయ్య
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. -

తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్
తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -

పోలవరంతో భద్రాచలంపై ప్రభావం
ఆంధ్రప్రదేశ్లో గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మొదటి దశలోనూ నీటిని నిల్వ చేస్తే వెనుక జలాల కారణంగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలంగాణ స్పష్టం చేసింది. -

ఎవరి ప్రయోజనం కోసం కవిత వ్యాఖ్యలు?
తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. -

నిరంజన్రెడ్డి అవినీతిపరుడు
ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. -

20 ఏళ్లలో ప్రథమ స్థానానికి భారతదేశ కోళ్ల పరిశ్రమ
దేశంలో కోళ్ల పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, మరో రెండు దశాబ్దాల్లో చైనాను అధిగమించి, ప్రథమ స్థానానికి చేరుకుంటుందని శ్రీనివాస ఫార్మ్స్ ఎండీ, వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఈవో) మాజీ ఛైర్మన్ సురేశ్రాయుడు చిట్టూరి అన్నారు. -

విమానాశ్రయం భూమి స్వాధీనం చెల్లదు
ఎయిర్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలో ఉన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి సర్వే నం.26లోని 9 ఎకరాలను స్వాధీనం చేసుకుంటూ 2008 ఫిబ్రవరి 26న తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించింది. -

గణనీయంగా పెరుగుతున్న దేవాలయాల ఆదాయం
రాష్ట్రంలోని దేవాలయాల ఆదాయం గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -

పోలవరం-నల్లమలసాగర్పై జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్(పీఎన్ఎల్పీ) అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు టెండరు పిలవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది. -

3న దివ్యాంగుల స్వయంసహాయక సంఘాల ప్రారంభం
దేశంలో తొలిసారిగా తెలంగాణలో దివ్యాంగుల స్వయంసహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లాంఛనంగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -

పార్టీ ఓబీసీ నేతలతో రాహుల్ భేటీ
కాంగ్రెస్లోని ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ) నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం భేటీ అయ్యారు. -

ఈ గోవా కళను.. హైదరాబాద్లోనే నేర్చుకున్నా..
ఈ కళాకారుడి పేరు సాగర్నాయక్ మూలే. గోవాకు చెందిన ప్రముఖ కావి చిత్రకళాకారుడు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న పశ్చిమ రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవంలో తన చిత్రాలతో ఈ స్టాల్ను ఏర్పాటు చేశారు. -

ఇది ‘డోర్న’డో!
భారీ నీళ్ల పైపు పగిలి నీరు ఎగజిమ్ముతున్నట్టుంది.. చూద్దాం పదా! అరె.. నీరు కాదే. టోర్నడోనా? అలాంటిదే అయి ఉంటుందా? సుడిగాలి ఏర్పడి నేలపై ఉన్న దుమ్ము ఇలా గాల్లోకి లేచిన ఈ దృశ్యం... -

పీపీ.. డుండుం.. మూగనోము
వివాహాలు, గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... సుముహూర్తాల కోసం చూస్తున్నారా... అయితే ఫిబ్రవరి 18 వరకూ వేచిచూడాలంటున్నారు పురోహితులు. శుక్ర మౌఢ్యమియే ఇందుకు కారణమంటున్నారు. -

‘తోట’కు అందం..
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అంటుంటారు. ఇక్కడ విత్తనాల కోసం వదిలిపెట్టిన తోటకూర మొక్కలు ముదిరి వివిధ దశల్లో ఇలా వర్ణశోభితంగా ఆకట్టుకుంటున్నాయి.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

పాక్-బంగ్లా చెట్టాపట్టాల్.. లక్ష టన్నుల బియ్యం ఎగుమతి
-

ఐ బొమ్మ రవి.. మరోసారి కస్టడీకి!
-

తాగునీటితో కారు క్లీనింగ్.. హైదరాబాద్లో వ్యక్తికి జరిమానా
-

అప్పుడు చేదు అనుభవం.. అందుకే ఇప్పుడు ఒప్పందం: ప్రశాంత్ వర్మ
-

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది
-

క్రైం కేసుల్లో డిటెక్టివ్లుగా నల్లులు..!


