PG Medical: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే
ఎంక్యూ1లో ఇకపై 15 శాతమే అఖిల భారత కోటాకు
జీవో తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పీజీ వైద్యవిద్య యాజమాన్య కోటాలో స్థానిక విద్యార్థులకు అత్యధిక సీట్లు దక్కనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో వందల మంది తెలంగాణ విద్యార్థులకు మేలు జరగనుంది. ఇప్పటి వరకు ప్రయివేటు పీజీ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లన్నీ అఖిల భారత కోటా విద్యార్థులకే దక్కేవి. ఈ విధానంతో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, యాజమాన్య కోటాలో 85% సీట్లు మన విద్యార్థులకే కేటాయించేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి మంత్రి దామోదర్ రాజనర్సింహ తీసుకెళ్లారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించి వెంటనే స్థానిక విద్యార్థులకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. ఈ క్రమంలో జీవో జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. కాళోజీ వర్సిటీ నిర్వహించనున్న పీజీ కౌన్సెలింగ్లో ఇకపై మన వారికి యాజమాన్య కోటాలో అదనంగా లబ్ధి కలగనుంది. ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానిక విద్యార్థులకు అధిక ప్రాధాన్యం దక్కేలా జీవో 33ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల్లో 50% సీట్లను అఖిల భారత కోటాలో, మిగతా 50% సీట్లను కన్వీనర్ కోటాలో స్థానికులతో భర్తీ చేస్తున్నారు. మనరాష్ట్రంలో ఉన్న 19 ప్రయివేటు పీజీ వైద్య కళాశాలల్లో 1,511 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలోని సగం సీట్లను కన్వీనర్ కోటా కింద స్థానికులకు కేటాయిస్తున్నారు. మిగతా సగం సీట్లను... ఎంక్యూ1, ఎంక్యూ2 (ఎన్ఆర్ఐ), ఎంక్యూ3 (ఇన్స్టిట్యూషనల్) కోటాల కింద భర్తీ చేస్తారు. ఇందులో ఎంక్యూ1కు 25% సీట్లు ఉండగా... ఎంక్యూ2, ఎంక్యూ3 రెండింటికీ కలిపి 25% సీట్లు ఉంటాయి. ఇప్పటివరకు ఎంక్యూ1 కింద భర్తీ చేస్తున్న మొత్తం సీట్లను ఆల్ ఇండియా కోటాకే కేటాయిస్తున్నారు. ఈ ఎంక్యూ1లోని 85% సీట్లను లోకల్ విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ వైద్యుల సంఘం సైతం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. - 
                                    
                                        

వరద సహాయక చర్యలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీవర్షాలకు నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవడానికి తీసుకున్న సహాయక చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. - 
                                    
                                        

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన డిసెంబరు 19 నుంచి
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(38వ) డిసెంబరు 19 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. - 
                                    
                                        

సగం బకాయిలిచ్చే వరకూ కళాశాలల బంద్
రాష్ట్రంలోని ఉన్నత విద్యా కళాశాలలకు ప్రభుత్వం బకాయిపడిన ఫీజు రీయింబర్స్మెంట్లో 50 శాతం.. అంటే రూ.5వేల కోట్లు చెల్లించేవరకు కళాశాలల బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల సమాఖ్య తేల్చి చెప్పింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


