Cyclone Montha: నిన్న వరద.. నేడు బురద!
ఖమ్మం, వరంగల్లో ముంపు కాలనీల జనం ఇక్కట్లు 
పొలాల్లో మేటలు.. తడిసిన ధాన్యంతో అన్నదాతల అవస్థలు 

హనుమకొండలో వరద ఉద్ధృతికి కోతకు గురైన వంద ఫీట్ల రోడ్డు..
ఈనాడు, వరంగల్, ఖమ్మం - సైదాపూర్, శంకరపట్నం, న్యూస్టుడే: మొంథా తుపాను వర్షాలు శాంతించినా.. పొలాల్లో ఇసుక మేటలు, రహదారులపై తడిసిన ధాన్యం అన్నదాతకు ఇక్కట్లను మిగిల్చాయి. మరోవైపు ముంపు కాలనీల్లో బురదమయమైన ఇళ్లు.. వరదతో ఛిద్రమైన రహదారులు ఇబ్బందికరంగా మారాయి. ప్రధానంగా వరంగల్, ఖమ్మంలోని ముంపు కాలనీల ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి చెమటోడుస్తున్నారు.
వరంగల్లో అవే పాట్లు..
మొంథా తుపాను ఉమ్మడి వరంగల్ను కోలుకోలేని దెబ్బతీసింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ నగరాల్లోని పలు కాలనీలు జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హనుమకొండలోని అమరావతీనగర్, నవయుగకాలనీ, టీవీటవర్స్ కాలనీ, గోకుల్నగర్, విద్యానగర్, సమ్మయ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని నిత్యావసరాలు, సామగ్రి, విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. శుక్రవారం వరద తగ్గడంతో ఇళ్లల్లో సామగ్రి, వస్తువులు, విద్యార్థుల పుస్తకాలు ప్రధాన రోడ్లపై ఆరబెట్టారు. నగరంలోని పలు ప్రధాన రహదారులు సైతం పూర్తిగా దెబ్బతిని ఆనవాళ్లు కోల్పోయాయి.

ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డలో ఇళ్లలో చేరిన బురదను శుభ్రం చేసుకుంటున్న మహిళలు
ఖమ్మంలో..
ఖమ్మం నగరం, ఏదులాపురం పురపాలికలో పలు కాలనీలను గురువారం వరద ముంచెత్తగా.. శుక్రవారం బురదతో ఆయా కాలనీలవారు సతమతమయ్యారు. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వాగు ఎట్టకేలకు శాంతించింది. మున్నేరు ఉరకలెత్తడంతో ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ కాలనీ, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, పద్మావతీనగర్, మోతీనగర్, ఏదులాపురం పురపాలికలోని కేబీఆర్ నగర్, జలగంనగర్ తదితర పదకొండు కాలనీలు గురువారం ముంపునకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంపు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లల్లోకి చేరుకున్నారు. బాధితులంతా ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రహదారులను ఖమ్మం నగరపాలక సిబ్బంది ట్యాంకర్లతో శుభ్రం చేశారు. వరద వచ్చిన ప్రతిసారీ వాననీరు, బురదతో ఇబ్బందులు తప్పడం లేదని.. ఏటా దుస్తులు, ఎలక్ట్రికల్ సామగ్రి దెబ్బతింటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ కరకట్ట త్వరితగతిన నిర్మించాలని వేడుకుంటున్నారు.

హనుమకొండ జిల్లా వివేక్నగర్ కాలనీలోని ఓ ఇంట్లో బురద నీటిలో కూరుకుపోయిన సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న కుటుంబ సభ్యులు

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారంలో తుడిచిపెట్టుకుపోయిన వరి పొలంలో మేట వేసిన రాళ్లు, రప్పలు

ఖమ్మం జిల్లా కూసుమంచిలో నేలకొరిగిన వరి పైరు
ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంలో నీట మునిగిన వరి పొలాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, చిగురుమామిడి, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాల్లో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. కొందరి పొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు పేరుకుపోయాయి. కల్లాలు, రోడ్లపై నిల్వ చేసిన వరి ధాన్యం పూర్తి స్థాయిలో ఎండకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 


