అక్షరాన్ని హత్తుకుంటున్నారు!
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు నీరాజనం పలుకుతున్నారు. పుస్తకావిష్కరణలు.. కొత్త పుస్తకాల పరిచయం.. రచయితల అనుభవాలు... సమకాలిన అంశాలపై చర్చలతో పుస్తక ప్రదర్శన ఆసక్తిగా కొనసాగుతోంది.
జాతీయ పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన
300 వరకు స్టాళ్లు.. జనవరి 1 వరకు నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు నీరాజనం పలుకుతున్నారు. పుస్తకావిష్కరణలు.. కొత్త పుస్తకాల పరిచయం.. రచయితల అనుభవాలు... సమకాలిన అంశాలపై చర్చలతో పుస్తక ప్రదర్శన ఆసక్తిగా కొనసాగుతోంది. మూడో రోజు శనివారం వారాంతం కావడంతో పుస్తక ప్రియులు పెద్దఎత్తున ప్రదర్శనకు తరలివచ్చారు.ఈ నెల 22న మొదలైన 35వ జాతీయ పుస్తక ప్రదర్శన జనవరి 1 వరకు జరగనుంది. ఇందులో 300 వరకు స్టాళ్లు ఏర్పాటుచేశారు. ప్రదర్శనకు సామాన్యులతో పాటు ప్రముఖులు, రచయితలు విచ్చేసి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.
తెలుగు సాహిత్యంలోని గుబాళింపును ఆస్వాదిస్తూ.. ఇతర భాషల్లోని రచనలను పరిచయం చేసుకుంటున్నారు. అభిమాన రచయితలు కనిపిస్తే సంభ్రమాశ్చర్యానికి లోనవుతున్నారు. డిజిటల్ యుగంలోనూ తమను అక్షరమే హత్తుకుంటోందని పాఠకులు చాటుతున్నారు. కొన్నేళ్లుగా పుస్తక ప్రదర్శనను తిలకించడం అలవాటుగా మార్చిన ఘనత హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకే దక్కుతుంది. డిసెంబరు చివరి వారం వచ్చిందంటే క్రిస్మస్, కొత్త సంవత్సర సంబురాలతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో పది రోజులపాటు పుస్తకాల పండగను మోసుకొస్తుందని పాఠకులు ఎదురుచూస్తుంటారు.
విద్యార్థులు ఎక్కువ..
ఈసారి ప్రదర్శనకు వస్తున్న వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. పుస్తక పఠనాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలు తమ విద్యార్థులను బృందాలుగా ప్రదర్శన సందర్శనకు ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు రాసిన పుస్తకాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. క్రిస్మస్ సెలవులు కావడంతో తల్లిదండ్రులు సైతం పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. కార్టూన్లు, చందమామ కథలు, పెద్ద బాలశిక్ష తదితరాలను కొంటున్నారు. యువత ఎక్కువగా పోటీ పరీక్షల పుస్తకాలపై దృష్టిసారిస్తోంది.
రచయితల కోసం..
రచయితల కోసం విశాలమైన స్టాల్ కేటాయించారు. పుస్తకాలను ప్రదర్శించి.. విక్రయించేందుకు వారికి అవకాశం కల్పించారు. పుస్తకాల గురించి స్వయంగా రచయితలే వివరిస్తున్నారు. పాత సాహితీ మిత్రులను కలుసుకోవచ్చని.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చని.. కొత్తతరం ఆలోచనలను తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో కొందరు రచయితలు ఇక్కడికి వస్తున్నారు. పుస్తక ప్రదర్శనకు వచ్చి వెళుతున్న వారికి మొక్కలను బహూకరిస్తున్నారు.
ముఖ్యమంత్రి పేరుతో స్టాల్
మన ముఖ్యమంత్రి పేరుతో స్టాల్ ఏర్పాటు చేసి అందులో కేసీఆర్ గురించి, ఆయన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై పలువురు రచయితలు రాసిన పుస్తకాలను ప్రదర్శించారు. సీఎంపై ఇన్ని పుస్తకాలు వచ్చాయా అనేంత స్థాయిలో ఉన్నాయి. ఈ స్టాల్ను పర్యావరణవేత్త వేదకుమార్ శనివారం ప్రారంభించారు. జూలూరు గౌరీశంకర్ రాసిన జీవధార, తెలంగాణ విజయగాథ], ఆత్మబంధువు, ఒక్కగానొక్కడు, పెద్దూరి వెంకటదాసు రచించిన తెలంగాణ కేసరి, కన్నోజు మనోహరాచారి రచించిన తెలంగాణ అభ్యుదయం, దేశానికి మహోదయం, మనోహర చిమ్మని రచించిన కేసీఆర్.. ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, తినేత్రి, దటీజ్ కేసీఆర్ పుస్తకాలను ప్రదర్శించారు.
డిజిటల్ రిపాజిటరీపై వివరణ
ఈసారి ప్రదర్శనలో తెలుగు, ఇతర రాష్ట్రాల్లోని ప్రచురణకర్తల స్టాళ్లతో పాటు పలు కొత్తవి ఏర్పాటయ్యాయి. భవిష్యత్తు తరాలకు తెలంగాణ అస్తిత్వ నిధిని అందించేందుకు ఇప్పుడున్న తాళపత్రాలు, పుస్తకాలు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్లను అత్యాధునిక ఐటీ ఉపకరణాల సాయంతో డిజిటల్ రూపంలో భద్రపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ‘తెలంగాణ డిజిటల్ రిపాజిటరీ’ తీసుకురాబోతున్నారు. ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం ఈ బాధ్యతలు చూస్తోంది. ఈ కృషి గురించి సందర్శకులకు వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే