NDAA 2023: తైవాన్కు అమెరికా మరో భారీ సైనిక సాయం..! చైనా స్పందన ఇదే
చైనా- తైవాన్(Taiwan)ల మధ్య వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ ద్వీప దేశానికి అమెరికా(America) భారీ సైనిక సహాయ నిధిని ప్రకటించింది. అగ్రరాజ్య ప్రతినిధుల సభ తాజాగా ఆమోదించిన రక్షణ వ్యయ బిల్లులో దీన్ని పొందుపర్చింది.
వాషింగ్టన్: చైనా- తైవాన్(Taiwan)ల మధ్య వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ ద్వీప దేశానికి అమెరికా(America) భారీ సైనిక సహాయ నిధిని ప్రకటించింది. అగ్రరాజ్య ప్రతినిధుల సభ తాజాగా ఆమోదించిన రక్షణ వ్యయ బిల్లులో దీన్ని పొందుపర్చింది. ఇందులో భాగంగా తైవాన్కు అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు సైనిక సాయం అందనుంది. 2023 నుంచి 2027 వరకు ఏడాదికి రెండు బిలియన్ డాలర్ల చొప్పున ఈ మొత్తాన్ని మంజూరు చేయనుంది. సెనేట్ ఆమోదం, దేశ అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు.. జాతీయ రక్షణ అధికార చట్టం(NDAA- 2023)గా రూపొందుతుంది.
తైవాన్కు అమెరికా తన ఆయుధ నిల్వల నుంచి ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల విలువైన రక్షణ సామగ్రి అందజేత లేదా సైనిక శిక్షణ వంటి సేవలను సమకూర్చేందుకు ఈ చట్టం అధికారం కల్పిస్తుంది. ‘ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాం’ కింద ఈ తోడ్పాటు అందించనుంది. తైవాన్తో అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని ఈ నిర్ణయాలు గణనీయంగా మెరుగుపరుస్తాయని ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్ సెనేటర్ బాబ్ మెనెండెజ్.. బిల్లు ఆమోదానికి ముందు ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు.. తైవాన్కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్డీఏఏ పేరిట చైనా వ్యతిరేక నిర్ణయాలను ఆమోదించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. తైవాన్ తమ భూభాగమే అని డ్రాగన్ పేర్కొంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు.. తైవాన్ దీన్ని తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ విషయంపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మరోవైపు.. ఏమైనా సమస్యలు తలెత్తితే తైవాన్కు అండగా నిలుస్తామంటూ అమెరికా పలు సందర్భాల్లో ప్రకటనలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సైనిక గ్రాంట్ను ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.