హైతీలో మెలిసా హరికేన్‌ బీభత్సం

Eenadu icon
By International News Desk Published : 30 Oct 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

25 మంది మృత్యువాత 

శాంటియాగో డి క్యూబా: కరీబియన్‌ దేశమైన హైతీని మెలిసా హరికేన్‌ కుదిపేసింది. ఈ పెను తుపాను తీవ్రతతో బుధవారం లా డిగ్యూ నదికి పోటెత్తిన వరదల్లో 25 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు- జమైకా, క్యూబాల్లోనూ మెలిసా హరికేన్‌ విధ్వంసం సృష్టించింది. జమైకాలో ఈ తుపాను ఒకరి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. క్లారెండోన్, సెయింట్‌ ఎలిజబెత్‌ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలు ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయాలు కలిగాయి. క్యూబాలో అధికారులు మెలిసాను కేటగిరీ-3 పెను తుపానుగా గుర్తించారు. ఇప్పటికే వారు వేల మందిని సురక్షిత స్థావరాలకు తరలించారు. ఈ హరికేన్‌ క్రమంగా బహమాస్‌ వైపు ప్రయాణించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు