2 ఉక్రెయిన్‌ నగరాలను చుట్టుముట్టాం: పుతిన్‌

Eenadu icon
By International News Desk Published : 31 Oct 2025 04:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కీవ్‌: ఉక్రెయిన్‌ తూర్పు భాగంలోని రెండు కీలక నగరాలను తమ దళాలు చుట్టుముట్టాయాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఉక్రేనియన్‌ సైన్యం ఖండించింది. మాస్కో సైనిక ఆసుపత్రిలో గాయపడిన సైనికులతో బుధవారం పుతిన్‌ మాట్లాడుతూ, యుద్ధంలో ఏం జరుగుతుందో చూడటానికి పశ్చిమ దేశాల, ఉక్రెయిన్‌ పాత్రికేయులను అనుమతించడానికి తాము సిద్ధమని తెలిపారు. దొనెట్స్క్‌ ప్రాంతంలోని ఉక్రెయిన్‌కు బలమైన పొక్రొవోస్క్‌ నగరాన్ని చుట్టుముట్టామని, ఖర్కీవ్‌ ప్రాంతంలోని కుపియాన్స్క్‌లోని కీలక రైల్వే జంక్షన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ రెండు నగరాల్లోని ఉక్రెయిన్‌ దళాలు లొంగిపోతే, ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ ఇంధన వ్యవస్థలే లక్ష్యంగా గత కొన్ని రోజులుగా దాడులు చేస్తున్న రష్యా...బుధవారం రాత్రి కూడా భారీగా విరుచుకుపడింది. 650 డ్రోన్లు, 50కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. 17 మందికి గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు