అమెరికాకు మానవ అక్రమ రవాణా.. భారతీయుడి సంస్థపై ఆంక్షలు

Eenadu icon
By International News Desk Published : 01 Nov 2025 04:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

న్యూయార్క్‌: దేశంలోకి అక్రమంగా ప్రజలను రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ భారతీయుడు, అతడి భార్య, అతని సంస్థ సహా 16 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. విక్రాంత్‌ భరద్వాజ్, అతనికి చెందిన కంపెనీ భరద్వాజ్‌ హెచ్‌ఎస్‌వోపై ఆంక్షలు విధించినట్లు ఫెడరల్‌ అధికారులు తెలిపారు. అతడి కంపెనీ మెక్సికో, యూఏఈ, భారత్‌ల నుంచి పనిచేస్తోందని.. ఆసియా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, ఐరోపాల నుంచి ఇప్పటి వరకు వేలమందిని అమెరికాలోకి అక్రమంగా తరలించిందని పేర్కొన్నారు. వలసదారులకు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి విమానాలు, నౌకల్లో తరలిస్తున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు