Gaza: గాజాలో మళ్లీ రక్తపాతం

Eenadu icon
By International News Desk Published : 30 Oct 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాల్పుల విరమణకు తూట్లు
ఇజ్రాయెల్‌ భీకరదాడులు
104 మందికిపైగా పాలస్తీనియన్ల మృతి

డెయిర్‌ అల్‌-బలా: గాజాలో మళ్లీ రక్తం ఏరులై పారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడింది. మంగళవారం రాత్రి నుంచి భారీస్థాయిలో గాజావ్యాప్తంగా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 104 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 46 మంది చిన్నారులు ఉన్నారు. 600 మందికి గాయాలయ్యాయి. దాడులు ముగిసిన వెంటనే, మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఒప్పందాన్ని హమాస్‌ ఉల్లంఘించిందని, అందుకే దాడులకు ఆదేశాలిచ్చానని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. దాడులను ట్రంప్‌ సమర్థించారు. ఇజ్రాయెల్‌ సైనికుడినొకరిని హమాస్‌ హతమార్చిందని, అందుకే టెల్‌అవీవ్‌ దాడులకు పాల్పడిందన్నారు. దీన్ని హమాస్‌ ఖండించింది. కాల్పుల విరమణను ఇజ్రాయెలే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు