Sheikh Hasina: దిల్లీలో స్వేచ్ఛగా జీవిస్తున్నా: షేక్ హసీనా

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలో తాను స్వేచ్ఛగా నివసిస్తున్నానని (Living freely in Delhi) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) పేర్కొన్నారు. అయితే తన కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె దిల్లీలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే హసీనా బుధవారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.
ఇందులో భాగంగా ఆవామీ లీగ్ పార్టీ నేతలపై ఆరోపణలు, స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆలోచనలు మొదలైన విషయాల గురించి హసీనా (Sheikh Hasina) మాట్లాడారు. వచ్చే ఏడాది బంగ్లాలో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోతే.. తమకు ఉన్న లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారన్నారు. భవిష్యత్తులో తన స్వదేశంలో అధికారం చేపట్టడానికైనా.. ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. బంగ్లాదేశ్లో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలంటే తిరిగి తమ ప్రభుత్వం అధికారం చేపట్టాలని అన్నారు. దేశ భవిష్యత్తును ఏ ఒక్క వ్యక్తిగానీ కుటుంబం కానీ నిర్వహించాలని తాను అనుకోవట్లేదని స్పష్టం చేశారు.
తాను దేశం విడిచి వెళ్లిన అనంతరం అవామీ లీగ్ నేతలపై దాడులు చేయడం, పార్టీపై నిషేధం విధించడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తమ స్వీయ ఓటమిని ఒప్పుకుందన్నారు. తదుపరి అధికారంలోకి వచ్చే ప్రభుత్వమైనా రాజ్యాంగబద్ధంగా ఎన్నికవ్వాలని ఆకాంక్షించారు. యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగా పేర్కొన్నారు. తనపై అభియోగాలు నమోదు చేసే ముందు బంగ్లాలోని కోర్టులు కూడా తనకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదన్నారు. తన వాదనను వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.
విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్ను వీడి భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అనంతరం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. అయితే ప్రభుత్వ నిషేధాన్ని తాము అంగీకరించడం లేదనీ, తమ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అవామీ లీగ్ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
ఇస్లాం ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
Indian student visa: కెనడాలో భారత విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. - 
                                    
                                        

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
Subramanyam Vedam: భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యంను అమెరికా నుంచి పంపించకుండా అక్కడి న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. - 
                                    
                                        

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు. - 
                                    
                                        

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. - 
                                    
                                        

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
షట్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. - 
                                    
                                        

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. - 
                                    
                                        

అఫ్గాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. - 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 


