JD Vance: ఉషకు మతం మారే ఆలోచన లేదు కానీ..
విమర్శలపై అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ స్పందన

న్యూయార్క్: తన సతీమణి ఉషా వాన్స్ క్రిస్టియన్ కాదని, ఆమెకు మతం మారే ఆలోచన లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం పేర్కొన్నారు. ఉష ఏదో రోజు క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నట్లు అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘నా మతాంతర వివాహం గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధి కావడంతో వీటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండటం సహజం. వీటిపై మాట్లాడకుండా తప్పించుకోలేను. నా మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను. నా సతీమణి కూడా చాలా ఏళ్ల క్రితమే ఇందుకు అంగీకరించింది. ఆమె క్రిస్టియన్ కాదు. మతం మారే ఆలోచన కూడా లేదు. కానీ, ఇతర మతాంతర వివాహాలు, బంధాల్లో మాదిరిగానే.. ఏదో ఒక రోజు నా దృష్టితో ఆలోచిస్తుందని ఆశిస్తున్నా. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తూ, ఆమెకు అండగా ఉంటూనే ఉంటా. ఆమె నా భార్య అయినందున అన్ని విషయాలపై ఆమెతో మాట్లాడతా’’ అని జేడీ వాన్స్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అఫ్గాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


