SpaceX Moon Flight: స్పేస్ఎక్స్ జాబిల్లి యాత్రకు భారత నటుడి ఎంపిక..!
స్పేస్ఎక్స్ నిర్వహించనున్న తొలి జాబిల్లి యాత్రకు భారత్కు చెందిన నటుడు దేవ్ జోషి ఎంపికయ్యాడు.
ఇంటర్నెట్డెస్క్: స్పేస్ఎక్స్ జాబిల్లి యాత్రలో ప్రయాణించే అవకాశం భారత్కు చెందిన ఓ నటుడికి లభించింది. జపాన్ బిలియనీర్ యుసాకు మేజవా రిజర్వు చేసుకొన్న స్పేస్ఎక్స్ యాత్ర కోసం ఎంచుకొన్న బృందంలో ‘బాల్వీర్’ ఫేమ్ దేవ్ జోషికి స్థానం దక్కింది. యుసాకు గతేడాది ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మక వ్యక్తుల కోసం అన్వేషణ చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని తన ప్రైవేటు స్పేస్ఎక్స్ ఫ్లైట్లో క్రూగా ఎంచుకొన్నట్లు వెల్లడించారు. ఇలా ఎంచుకున్న వారిలో దేవ్ జోషితోపాటు అమెరికన్ డీజే స్టీవ్ అయెకి, కొరియాన్ స్టార్ టీవోపీ (చోంగ్ సెయుంగ్ హ్యూన్), చెక్ రిపబ్లిక్కు చెందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ యేమీ ఎ.డి., ఐర్లాండ్కు చెందిన రియాన్నోన్ ఆడమ్, అమెరికా యూట్యూబర్ టిమ్ డోడ్డ్, యూకేకు చెందిన ఫొటోగ్రాఫర్ కరీమ్ ల్లియ, అమెరికాకు చెందిన దర్శకుడు బ్రెండన్ హాల్, స్నోబోర్డర్ కైట్లిన్ ఫారింగ్టన్, జపాన్ డ్యాన్సరు మియూ ఉన్నారు.
ఈ యాత్ర వచ్చే ఏడాది జరగవచ్చని అంచనావేస్తున్నారు. 1972 తర్వాత మానవ సహిత తొలి జాబిల్లి యాత్ర ఇదే కావచ్చు. ఈ యాత్రలో భాగంగా వీరు జాబిల్లికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్య వరకూ వెళతారు. ఈ యాత్రకు మొత్తం 8 రోజుల సమయం పట్టనుంది. దీని కోసం ఉపయోగించే స్టార్ షిప్ రాకెట్కు అమెరికా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. వాస్తవానికి ఈ అంతరిక్ష నౌక ప్రయోగ పరీక్ష గతేడాది మేలోనే పూర్తయింది. భూభ్రమణ పరీక్షకు మాత్రం ఇప్పటి వరకు అనుమతులు లభించకపోవడంతో టెక్సాస్లో నిలిచి ఉంది.
యుసాకు మేజవా గతేడాది నుంచి ట్విటర్ వేదికగా తన క్రూ సభ్యులను ఎంచుకోవడం మొదలుపెట్టారు. దీనికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నట్లు యుసాకు పేర్కొన్నారు. ఆయన బృందంలో క్రీడాకారులు, కళాకారులే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా