US: ‘జాబ్ లేదు.. వీసా టైం ఆగదు’: అమెరికాలో భారతీయులకు కొత్త సవాళ్లు..!
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారత ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. వీరంతా అగ్రరాజ్యంలో ఉండాలంటే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే..!
అమెజాన్లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికా (US)లో అడుగుపెట్టింది. ఇటీవల లేఆఫ్ల్లో భాగంగా మార్చి 20 ఆమె చివరి వర్కింగ్ డే అని చెప్పారు. హెచ్-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో అవకాశం లేదు.
హెచ్-1బీ (H-1B) వీసాతో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేస్తున్న సీత (పేరు మార్చాం) జనవరి 18న లేఆఫ్ (Lay-off)కు గురైంది. ఒంటరి తల్లి. కొడుకు త్వరలోనే కాలేజీలో చేరబోతున్నాడు. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది.
వీరిద్దరే కాదు, అమెరికా (America)లో ఉంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇది..! ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు అమెరికాలోని టెక్ కంపెనీలు కోతల బాటపట్టాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు సహా అమెరికాలో అనేక టెక్ కంపెనీలు ఇటీవల వేలాదిగా ఉద్యోగుల కోతలు ప్రకటించాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది ఐటీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో 30 నుంచి 40శాతం మంది భారత ఐటీ నిపుణులే (Indian IT professionals) . వీరిలో మెజార్టీ ఉద్యోగులు హెచ్-1బీ, ఎల్1 వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. దీంతో అగ్రరాజ్యంలోనే ఉండేందుకు ఇప్పుడు వీరంతా ప్రత్యామ్నాయాలు అన్వేషించక తప్పట్లేదు. గడువులోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లేదా.. వీసా స్టేటస్ను మార్చుకునేందుకు వీరు తంటాలు పడుతున్నారు.
‘‘వేలాది మంది టెక్ ఉద్యోగులు లేఆఫ్లను ఎదుర్కోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు విధుల నుంచి తొలగిపోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదంటే వీసాను మార్చుకోవాలి. దీంతో ఈ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల హెచ్-1బీ వీసాదారులకు టెక్ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉన్న సమస్యల కారణంగా వీరి టర్మినేషన్ తేదీని కొన్ని నెలలు పొడిగించాలి’’ అని సిలికాన్ వ్యాలీకి చెందిన ఎంటర్ప్రెన్యూర్ అజయ్ జైన్ భుటోరియా అభిప్రాయపడ్డారు.
అమెరికా (US) టెక్ పరిశ్రమలో అధిక మొత్తంలో ఉద్యోగులు భారత వలసదారులే. దీంతో లేఆఫ్ల్లోనూ వీరే ఎక్కువ మంది ఉన్నారు. యూఎస్ నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు లేఆఫ్లో ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదంటే ఆ గడువు దాటిన 10 రోజుల్లోగా అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు