USA: అమెరికా సెనెట్లో ట్రంప్నకు చుక్కెదురు

ఇంటర్నెట్డెస్క్: ఓ టీవీ యాడ్ కారణంగా కెనడా (Canada)తో వాణిజ్య చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దానిపై అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించారు. అయితే, ట్రంప్ నిర్ణయానికి అమెరికా సెనెట్లో చుక్కెదురైంది. కెనడాపై టారిఫ్ల తొలగింపునకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి (USA-Canada).
ట్రంప్ సుంకాల అధికారాలను అంతం చేసేందుకు డెమోక్రట్లతో పాటు నలుగురు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా సెనెట్లో 50-46 ఓట్లు పడ్డాయి. గతంలోను ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో డెమోక్రట్ పార్టీ సభ్యుడు, వర్జీనియా సెనెటర్ టిమ్ కైన్ మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాలకు వ్యతిరేకంగా కెనడాపై ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని సమర్థించలేమన్నారు. ఆ దేశంతో ఉన్న దీర్ఘకాల సంబంధాలు తెగిపోవడానికి తాను ఇష్టపడటం లేనందున దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కెనడా సరిహద్దు రాష్ట్రం మైనే సెనెటర్ సుసాన్ కాలిన్స్ మాట్లాడుతూ.. ఈ సుంకాలు తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైనా తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
ఇక, దీనికి ముందు బ్రెజిల్పై ట్రంప్ సుంకాల అధికారాన్ని వ్యతిరేకిస్తూ సెనెట్లో ఇలాంటి తీర్మానమే తీసుకొచ్చారు. దీనికి కూడా సెనెట్లో ఆమోదం లభించింది. యూఎస్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ కెనడా ఇచ్చిన ప్రకటనలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆ దేశంతో నడుస్తోన్న వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
Subramanyam Vedam: భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యంను అమెరికా నుంచి పంపించకుండా అక్కడి న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. - 
                                    
                                        

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు. - 
                                    
                                        

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. - 
                                    
                                        

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
షట్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. - 
                                    
                                        

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. - 
                                    
                                        

అఫ్గాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. - 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 


