china: చైనాలో ఏమిటీ ‘తెల్లకాగితం విప్లవం’..?
చైనా పాలకులకు తెల్లకాగితం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎక్కడైనా తెల్లకాగితంతో జనం కనిపిస్తే పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఎందుకలా..?
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తియానన్మెన్ స్క్వేర్ ఆందోళన తర్వాత ఇవే అతిపెద్ద నిరసనలు. చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా మంది నేతలు చదువుకున్న ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో కూడా ఇవి చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రజలు తమ నిరసనలు తెలియజేయడానికి తెల్ల కాగితాలను గుర్తుగా ఎంచుకొన్నారు. దీంతో ఈ ఆందోళనలను ‘తెల్లకాగితం ఆందోళనలు’ లేదా ‘ఏ4 విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా ఈ ఆందోళనలను కఠినంగా అణచివేస్తోంది.
ఏ4 తెల్లకాగితాలు ఎందుకు..?
చైనాలో సాధారణంగా ఎటువంటి ఆందోళనలనైనా మొగ్గదశలోనే అణచివేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కానీ, వ్యక్తులను కానీ కించపర్చకుండా ఆందోళన చేయాలంటే తెల్లకాగితం ఉపయోగించడం ఒక్కటే మార్గం. దీంతోపాటు చైనాలోని సెన్సార్షిప్ను తెలియజేసేందుకు కూడా ఈ శ్వేతపత్రం గుర్తుగా ఉంటుంది. ఆందోళన సమయంలో వారు ఏమి తెలియజేయకుండానే విషయం అందరికీ తెలుస్తుంది. ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో ఈ రకంగానే విద్యార్థులు నిరసన తెలిపారు. 2020లో హాంకాంగ్ ఆందోళనల్లో కూడా తెల్లకాగితాన్ని గుర్తుగా వినియోగించారు. ఇప్పుడు నేరుగా చైనాలోని ఆందోళనలకు వీటిని వాడటం అక్కడి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తోంది.
సోషల్ మీడియాలో భారీగా సెన్సార్.. పేపర్ కంపెనీల షేర్ల పతనం..!
ఈ తెల్లకాగితం ప్రదర్శనలను సోషల్ మీడియా నుంచి మాయం చేయడానికి చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనాలో టెక్ దిగ్గజాలైన టిక్టాక్, విబో వంటివి ఖాళీ తెల్లకాగితం చిత్రాలను తమ వేదికలపై నుంచి తొలగిస్తున్నాయి. ఈ ఉద్యమం ఎంతగా పెరిగిపోయిందంటే.. చైనాలో ఏ4 తెల్లకాగితాల విక్రయాన్ని ఆపేశారనే వదంతులు కూడా వ్యాపించాయి. ఫలితంగా అక్కడ ప్రముఖ స్టేషనరీ చైన్ స్టోర్ల సంస్థ ‘ఎం అండ్ జీ స్టేషనరీ’ షేర్లు 3.1శాతం పతనం అయ్యాయి. ఈ సంస్థకు చైనా వ్యాప్తంగా 80,000 స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఏ4 కాగితాల విక్రయాన్ని నిలిపివేసిందనే వార్తలే దీనికి కారణం. చివరికి ఆ సంస్థ ఆ తప్పుడు వార్తలను ఖండించాల్సి వచ్చింది.
గతంలో జూన్ 4వ తేదీన తియానన్మెన్ స్క్వేర్ ఘటన సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడాన్ని చైనా నిషేధించింది. దీంతో చైనా వాసులు ఆరోజుకు ‘మే 35’ అనే కోడ్నేమ్ పెట్టారు. తర్వాత దానిని కూడా చైనా నిషేధించింది. కానీ, వైట్పేపర్ విషయంలో చైనా చేయడానికి పెద్దగా ఏమీలేదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ సారి ఆందోళనలు గతంలో కంటే బలంగా కొనసాగవచ్చని చెబుతున్నారు.
జిన్పింగ్కు అగ్నిపరీక్ష..
మూడోసారి అధికారం చేపట్టిన షీజిన్పింగ్కు ఈ ఆందోళనలు అగ్నిపరీక్షగా మారాయి. జీరో కొవిడ్ పేరిట నెలల తరబడి ప్రజలను ఇళ్లలోనే బంధిస్తుండటంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొన్నాయి. ఖతార్లో ఫిఫా ప్రపంచకప్లో అభిమానులు మాస్కులు వంటివి లేకుండానే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. చైనాలో మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి పరిస్థితులు మారలేదు. దీనికి తోడు సెప్టెంబర్లో క్వారంటైన్ బస్సు ప్రమాదానికి గురై 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గతనెలలో కొవిడ్ లాక్డౌన్లకు వ్యతిరేకంగా ఝాంఝూలో కార్మికులు పోలీసులపై తిరగబడ్డారు. ఇటీవల షింజియాంగ్లో ఉరుంకీ నగరంలో అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించడం ప్రజాగ్రహాన్ని తీవ్రస్థాయికి చేర్చింది. ఈ నగరం దాదాపు 100 రోజుల నుంచి కఠిన లాక్డౌన్లో ఉంది. ఇప్పుడు ఆందోళనలు కొవిడ్ లాక్డౌన్లను దాటి.. షీజిన్పింగ్ను తొలగించాలనే వరకూ చేరుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు