కోర్సుతోపాటు ఆర్మీ కొలువు
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకు ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ దారి చూపుతుంది. జేఈఈ మెయిన్ స్కోరుతో దరఖాస్తులు షార్ట్లిస్ట్ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు.