Hyberabad: రూ.10 లక్షల డీజిల్ అక్రమ రవాణా.. ఏడుగురు అరెస్ట్‌

కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ రవాణా చేసి హైదరాబాద్‌లో డోర్ డెలివరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేశారు.

Published : 24 Apr 2024 18:39 IST

కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ రవాణా చేసి హైదరాబాద్‌లో డోర్ డెలివరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. 9 మందిలో ఏడుగురిని అరెస్టు చేశారు. బాలానగర్‌కి చెందిన డీజిల్ వ్యాపారి రాధాకృష్ణ, సూర్య.. మరో ఏడుగురితో కలిసి ముఠాగా ఏర్పడి కర్ణాటక నుంచి డీజిల్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో కావాల్సిన వారి ఇంటికి నేరుగా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గచ్చిబౌలి వట్టినాగులపల్లి కేంద్రంగా డీజిల్ అక్రమ సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. 

Tags :

మరిన్ని