Alluri Dist: గిరిజన గ్రామాల మధ్య భూ తగాదా.. కర్రలతో వీరంగం

భూ తగాదా ఆ గిరిజన గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలం ఎర్రబయలు గ్రామస్థులు 29 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటున్నారు. ఇదే భూమిపై జి.మాడుగుల మండలం గొందిపల్లి, తులం గ్రామస్థులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నారు. ఎర్రబయలు స్థానికులకు భూపత్రాలు ఉండటంతో హైకోర్టులో స్టే నడుస్తోంది. ఇదే క్రమంలో ఓ వర్గం ఈ భూమిపై కొలతలు తీసుకోవడంతో శుక్రవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గొందిపల్లి, తులం గ్రామస్థులు.. ఎర్రబయలు గ్రామంలోకి చొరబడి వీరంగం సృష్టించారు. ఇళ్లతోపాటు వాహనాలు, సామాన్లు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని కర్రలతో బాదడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

Published : 04 Feb 2024 17:14 IST

భూ తగాదా ఆ గిరిజన గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలం ఎర్రబయలు గ్రామస్థులు 29 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటున్నారు. ఇదే భూమిపై జి.మాడుగుల మండలం గొందిపల్లి, తులం గ్రామస్థులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నారు. ఎర్రబయలు స్థానికులకు భూపత్రాలు ఉండటంతో హైకోర్టులో స్టే నడుస్తోంది. ఇదే క్రమంలో ఓ వర్గం ఈ భూమిపై కొలతలు తీసుకోవడంతో శుక్రవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గొందిపల్లి, తులం గ్రామస్థులు.. ఎర్రబయలు గ్రామంలోకి చొరబడి వీరంగం సృష్టించారు. ఇళ్లతోపాటు వాహనాలు, సామాన్లు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని కర్రలతో బాదడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు