Vijayawada: విజయవాడలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 26 మందికి అస్వస్థత

విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందారు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు.

Published : 28 May 2024 19:10 IST

విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందారు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల్లో 26 మంది కలుషితనీటి బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పైపులైన్‌లో వస్తున్న తాగునీటిని పరీక్షిస్తున్నారు. 

Tags :

మరిన్ని