AP News: ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై ఈసీ వేటు

జగన్‌ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. అధికార వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారైన ఆయన.. ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆయన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించేసి, తక్షణమే ఆ విధుల నుంచి ఆయన్ను రిలీవ్‌ చేయాలని ఆదేశించింది.

Published : 17 Apr 2024 09:19 IST

జగన్‌ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. అధికార వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారైన ఆయన.. ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆయన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించేసి, తక్షణమే ఆ విధుల నుంచి ఆయన్ను రిలీవ్‌ చేయాలని ఆదేశించింది.

Tags :

మరిన్ని