Badvel: సీసీరోడ్డు పనుల బిల్లులు చెల్లించట్లేదని.. ఇంజినీర్తో గుత్తేదారుల వాగ్వాదం
వైఎస్సార్ జిల్లా బద్వేల్ పురపాలక కార్యాలయంలో ఇంజినీర్, గుత్తేదారుల మధ్య వాగ్వాదం జరిగింది. సీసీరోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి 5 నెలలు దాటినా.. బిల్లులు చెల్లించలేదని ఇంజినీర్ను గుత్తేదారులు నిలదీశారు. బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ తిప్పుతారా? అంటూ వాగ్వాదానికి దిగారు. మార్చి నెలలో బిల్లులు ఎందుకు పాస్ చేయలేదని ప్రశ్నించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
Published : 04 Apr 2024 14:59 IST
Tags :