Viral Video: కార్యాలయంలో అధికారిణి రచ్చ.. కంప్యూటర్లు పగులగొట్టి, సిబ్బంది కొట్టి..
ఛత్తీస్గఢ్లో భిలాయ్ స్టీల్ ప్లాంట్ (Bhilai Steel Plant)లో ఓ అధికారిణి ఆఫీస్లోని కంప్యూటర్లు పగులగొట్టి, తోటి సిబ్బందిని కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్లోని కార్యాలయంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పని చేస్తున్న ప్రియాంక హోరో.. కోపంతో రచ్చరచ్చ చేశారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు పగలగొట్టి, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. సిబ్బందిని తిడుతూ.. తోటి మహిళలను టిఫిన్ బాక్స్తో తలపై కొట్టారు. అంతటితో ఆగకుండా బల్లలు, పలు పత్రాలపై నీళ్లు పోశారు. మహిళా అధికారి చర్యలకు నివ్వెరపోయిన సహా ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
Published : 26 Nov 2023 15:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం