Konda Vishweshwar Reddy: చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.4,490 కోట్లు

చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తన కుటుంబం పేరిట రూ.4490 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు.

Published : 23 Apr 2024 09:59 IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తన కుటుంబం పేరిట రూ.4490 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. సొంత కారు లేదని, నాలుగు క్రిమినల్ కేసులున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తన భార్య సంగీతా రెడ్డి, తనకు రూ. కోటి అప్పు ఉందని విశ్వేశ్వర్ రెడ్డి అస్తుల చిట్టాలో వివరించడం విశేషం. 2019లో సమర్పించిన ఎన్నికల అఫడివిట్‌లో ఆస్తుల వివరాలతో పోలిస్తే ప్రస్తుతం విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు 423 శాతం పెరిగాయి.

Tags :

మరిన్ని