Bonda Uma: మార్గదర్శివన్నీ అఫీషియల్‌ చిట్స్‌: బొండా ఉమా

విజయవాడ: చిట్‌ఫండ్‌ చట్టప్రకారం పనిచేస్తున్న సంస్థలపై కుట్ర చేస్తారా? అని ఏపీ ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కోట్ల రూపాయలతో పత్రికలో తప్పుడు ప్రకటనలు ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మార్గదర్శి వాళ్లు డబ్బులు ఎగ్గొట్టారని ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? డబ్బులు ఎగ్గొట్టారనో.. ఆలస్యం చేశారనో ఫిర్యాదు చేయాలని చందాదారులను ఒత్తిడి చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ.. మీ అవినీతిని వెలికితీస్తుందని మార్గదర్శిని వేధిస్తారా? వైకాపా అవినీతిని వెలికితీసేవాళ్లను వేధించేందుకేనా సీబీసీఐడీ? మార్గదర్శివన్నీ అఫీషియల్‌ చిట్స్‌. కోర్టులు చెప్పినా జగన్‌ వినడంలేదు’’ అని బొండా ఉమా అన్నారు.

Updated : 31 Jul 2023 11:11 IST

విజయవాడ: చిట్‌ఫండ్‌ చట్టప్రకారం పనిచేస్తున్న సంస్థలపై కుట్ర చేస్తారా? అని ఏపీ ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కోట్ల రూపాయలతో పత్రికలో తప్పుడు ప్రకటనలు ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మార్గదర్శి వాళ్లు డబ్బులు ఎగ్గొట్టారని ఒక్కరైనా ఫిర్యాదు చేశారా? డబ్బులు ఎగ్గొట్టారనో.. ఆలస్యం చేశారనో ఫిర్యాదు చేయాలని చందాదారులను ఒత్తిడి చేస్తున్నారు. ఈనాడు, ఈటీవీ.. మీ అవినీతిని వెలికితీస్తుందని మార్గదర్శిని వేధిస్తారా? వైకాపా అవినీతిని వెలికితీసేవాళ్లను వేధించేందుకేనా సీబీసీఐడీ? మార్గదర్శివన్నీ అఫీషియల్‌ చిట్స్‌. కోర్టులు చెప్పినా జగన్‌ వినడంలేదు’’ అని బొండా ఉమా అన్నారు.

Tags :

మరిన్ని