Chiranjeevi: పవన్‌ ఏం చేయగలడో చూడాలంటే ఆయన్ను గెలిపించండి: చిరంజీవి

తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి పవన్‌కల్యాణ్‌ అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. జనసేన గెలుపు కోరుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Published : 07 May 2024 11:48 IST

తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి పవన్‌కల్యాణ్‌ అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. జనసేన గెలుపు కోరుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ పవన్‌ కల్యాణ్‌ తన సొంత సంపాదనను కౌలు రైతులు, జవాన్ల కోసం ఖర్చు పెట్టాడు. సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడు. అన్యాయాన్ని ఎదిరించేందుకు, జనం కోసం జన సైనికుడయ్యాడు. పవన్‌ ఏం చేయగలడో చూడాలంటే ఆయన్ను గెలిపించండి’’ అని చిరంజీవి కోరారు.    

Tags :

మరిన్ని