Hyderabad: గొర్రె ఇంట్లోకి వచ్చిందని.. మహిళపై పాస్టర్ దాడి!

ఓ చర్చి పాస్టర్‌.. మహిళా గొర్రెల కాపరిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 30 May 2024 17:09 IST

ఓ చర్చి పాస్టర్‌.. మహిళా గొర్రెల కాపరిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ గుర్రంగూడలో ఈనెల 24న సాయంత్రం 6 గంటల సమయంలో పద్మ అనే మహిళ తన గొర్రెలు, మేకలను మేపుతుండగా ఒక గొర్రె .. పాస్టర్ ఇంటి ప్రహరీ గోడ ఎక్కింది. ఈ క్రమంలో గొర్రెల కాపరిని పాస్టర్ అసభ్యపదజాలంతో దూషిస్తూ.. చీపురు కట్టతో దాడి చేశాడు. దెబ్బలకు తాళలేక ఆ మహిళ ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తింది. తనను వెంబడించి విపరీతంగా కొట్టి.. గాయపరచి తన కుక్కతో కరిపించడానికి ప్రయత్నించాడని బాధితురాలు వాపోయింది. పాస్టర్ దాడి చేసిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు